చంద్రశేఖరపురంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్ర రెడ్డి, కనిగిరి నియోజకవర్గం బిజెపి మాజీ కన్వీనర్ కొండిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో ఇంటింటికీ స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్వదేశీ వస్తువులనే వాడాలని ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వదేశీ అనేది కేవలం వస్తువుల ఎంపిక కాదన్నారు. అది దేశ ఆర్థిక స్వావలంబన, భారతీయ కార్మికుల గౌరవం, సంస్కృతి పరిరక్షణకు పునాది అన్నారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను వాడాలని కోరారు.