వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి లో సీనా వలి అనే వ్యక్తి సోమవారం మహిళను హత్య చేసి. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించిన విషయం విధితమే. అక్కడ చికిత్స పొందుతూ సీనా వలి మృతి చెందాడు. దీనిపై పామూరు సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.... కట్ట కింద పల్లి లో జరిగిన ఘటనలో మహిళ మృతి చెందిన అనంతరం సీనా వలి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడని, అతనిని కనిగిరి వైద్యశాలకు తరలించగా, సీనా వలి మృతి చెందాడు అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.