ఆత్మకూరు: మర్రిపాడులోని అచ్చమాంబ గుడి వద్ద గేదెను ఢీకొట్టిన బైక్, వ్యక్తికి గాయాలు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడులోని అచ్చమాంబ గుడి వద్ద నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ రోడ్డుపై అడొచ్చిన గేదెను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో అతనిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గేదె రోడ్డు పక్కన ప్రాణాలతో కొట్టు మీట్టాడుతూ ఉంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.