డోన్: బేతంచర్ల ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
Dhone, Nandyal | Jun 8, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల ఎంఆర్వో కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాల్ ద్వారా కలెక్టర్ రాజకుమారి అధికారులతో మాట్లాడి, ప్రజాసమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంఆర్వో నాగమణి, కమిషనర్ హరిప్రసాద్, ఎంపీడీవో ఫజల్ రెహమాన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సదస్సులో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.