అనంతపురం జిల్లా రేకులకుంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో చెన్నంపల్లి గ్రామానికి చెందిన నిరంజన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.