పాణ్యం మండలం కొత్తూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయాన్ని నూతనంగా నిర్మిస్తున్నారు. గతంలో ఇక్కడ శివాలయం ఉండగా, శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వచ్చే సంవత్సరం ఆలయం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ నిర్మాణానికి భక్తులు తమ వంతుగా సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.