విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏ విధంగా ఉందో ఆ విధంగానే కొనసాగిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పర్మినెంట్ గా పని చేస్తున్న ఉద్యోగులను కూడా వీఆర్స్ ఇచ్చి పంపించే విధంగా ప్రయత్నాలు సాగుతొందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.