ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో ముగిసిన పదవ తరగతి పరీక్షలు, 17 రోజులు పాటు జరిగిన పరీక్షల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు
Ongole Urban, Prakasam | Apr 2, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నేటితో మిగితాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరిగాయి. మార్చి 16న ప్రారంభమై నేటితో ముగిసిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తతో 144 సెక్షన్ విధించినట్లు అధికారులు తెలిపారు. నెట్ సెంటర్లు జిరాక్స్ షాపులను నోటీసులు ఇచ్చి మూయించినట్లు వెల్లడించారు.