ఒంగోలు అర్బన్: ఏపీఏఐఓఎంఎస్ 2.o యాప్ ద్వారా రైతులకు కావాల్సిన యూరియాను అందిస్తాం: రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా
Ongole Urban, Prakasam | Jun 9, 2026
ఏపీఏఐఓఎంఎస్ 2.o యాప్ ద్వారా రైతులకు కావాల్సిన యూరియాను అందించేందుకు డీలర్లు రైతు సేవ కేంద్రాల ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా అన్నారు. గత సంవత్సరం రైతులు వేసిన పంట వివరాలను ఇప్పటికే ఈ యాపుల్లో పొందుపరచడం జరిగిందని దీని ఆధారంగా రైతులకు ఎంత యూరియా అవసరమవుతుందో ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచుతుందన్నారు. మూడు విడతల్లో యూరియా బస్తాలను రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు తో ఈ యాప్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందని రైతు సేవ కేంద్రం అధికారులు మరియు డీలర్లు ఈ యాప్ లో లాగిన్ కావాల్సి ఉంటుందన్నారు.