అనంతపురం అర్బన్: శ్రీహరిపురం వద్ద టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రామగిరి మండలం ఎన్ ఎస్ గేట్ సమీపంలో ఉన్న శ్రీహరిపురం వద్ద జాతీయ రహదారిపై టాటా ఏస్ వాహనం టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నల్లమడ మండలం నల్ల సింగయ్య గారి పల్లి గ్రామానికి చెందిన గంగులమ్మ రమణారెడ్డి చెడ్రాయుడు పరిణిక అనే వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.