ఐనవోలు: మల్లికార్జున స్వామి దేవాలయంలో 100 సంవత్సరాల శివాల మర్రి చెట్టు నేలకొరిగింది
హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు ఇది.. శివాల మర్రికి ప్రదక్షణ అనంతరమే భక్తులు స్వామిని దర్శించుకోవడం అనవాయితీ.. అయితే కుండపోత వర్షానికి ఈ చెట్టు నేలకొరిగింది.అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయాల్లో ఐనవోలు మల్లికార్జునస్వామి ఒకటి. అటువంటి ఆలయ చరిత్రలో శివాలమర్రి చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే శివసత్తులు, భక్తులు ముందుగా శివాలమర్రి దగ్గర శివసత్తులు వేషధారణ వేసుకొని శివాలమర్రి చుట్టూ శివసత్తులు, భక్తులు ప్రదక్షిణ చేసిన తరువాతే స్వామి వారి దర్శనం చేసుకుంటారు