నంద్యాల అర్బన్: పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకుల పై అక్రమ కేసులు: నంద్యాలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు
Nandyal Urban, Nandyal | May 1, 2026
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నాయకులను, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులతో వేధిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.