మామిడికాయలను అమ్మేందుకు మండికి వచ్చి కారు ప్రమాదంలో అప్పిలేపల్లికి చెందిన రైతు మృతి
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి టమోటా మండి సమీపంలో మామిడికాయలను అమ్మేందుకు మామిడికాయల మండికి వచ్చి ఆరుబయట పండుకొని ఉండగా అతనిపై నుంచి కారు దూసుకుని వెళ్లడంతో జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం అప్పిలేపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రన్న మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.