అనంతపురం నగరంలోని కెఎస్ఆర్ బాలికల జూనియర్ మరియు ఒకేషనల్ కళాశాలలో ఎంపీ నిధులు కింద ఇచ్చిన మాట ప్రకారం నిలుపుకొని, అతి తక్కువ సమయంలోనే పేద విద్యార్థులకు మంచినీటి వసతిని అందించాలని 1,800 మంది విద్యార్థుల కోరిక మేరకు, మంగళవారం ఉదయం 11 గంటల సమయం లో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు పేద విద్యార్థులకు వరం లాంటిదన్నారు.మంచి నీటిని ఉపయోగించుకొని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటిని తాగడానికి, పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకువచ్చారు.