హుస్నాబాద్: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, వారి స్వగ్రామమైన కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో ఆదివారం ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి హరీష్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.