ఉలవపాడు మండలంలో వైసీపీకి భారీ షాక్
ఉలవపాడు మండలం, బద్దిపూడికి చెందిన 37 కుటుంబాలు వైసిపికి రాజీనామా చేసి, సోమవారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన పాత, కొత్త నాయకులందరూ కలసికట్టుగా పని చేసి, కందుకూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది.