నందికోట్కూరు: నందికొట్కూరులో వికలాంగ అభాగ్యుడి ఆవేదన
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో భిక్షాటన చేస్తున్న వికలాంగుడు రాముడు తన సమస్య పట్టించుకునే ఎమ్మెల్యే గాని అధికారులు గానీ లేరని సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు, నీటి మునుక ప్రాంతానికి చెందిన రాముడు 20 సంవత్సరాల కిందట నందికొట్కూరు మండలము లోని కోళ్ల బావాపురం లో ఉన్నప్పుడు వికలాంగుల పెన్షన్ మంజూరు చేశారు, ఈ పెన్షన్ అలంపూర్ లో రావడంతో ఇక్కడి నుంచి పెన్షన్ తెచ్చుకోవడానికి ప్రతినెలా 1000 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు, కావున తనకు ఇక్కడే పెన్షన్ ఇప్పించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని కోరారు