యాడికి మండల కేంద్రంలో మన గ్రోమోర్ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. సుమారు రెండు గంటల పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన అక్షయ తో పాటు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నిర్వాహకులు హరీష్, మోహన్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. పట్టు చీరలను బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో మన గ్రోమోర్ సిబ్బంది పాల్గొన్నారు.