ఒంగోలు అర్బన్: లారీని వెనకనుంచి ఢీ కొట్టిన బస్సు లారీ డ్రైవర్ మృతి. బస్సులోనే పలువురు ప్రయాణికులకు గాయాలు
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ప్రకాశం జిల్లా ఏడుకొండలపాడు సమీపంలో చెన్నై కోల్కత్తా జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీ కొట్టింది బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే హైవే అంబులెన్స్ మరియు 108 సహాయంతో గాయపడ్డ వారిని ఒంగోలు జిజిహెచ్ వైద్యశాలకు తరలించారు మృతి చెందిన లారీ డ్రైవర్ను పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు జిజిహెచ్ కు తరలించారు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధిక వేగం వల్ల ప్రమాదం జరిగినట్లుగా బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు