హత్నూర: తల్లిదండ్రుల పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్
మహా అమావాస్య సందర్భంగా ఆదివారం తల్లిదండ్రుల పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చయ్య మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ లలిత రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.