అన్నమయ్య జిల్లా ఎస్పీ ధరీజ్ ఆదేశాల మేరకు, గాలివీడు మండలం తూముకుంట గ్రామ సచివాలయంలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, మహిళలపై దాడులు, సైబర్ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు మరియు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్కిరెడ్డిపల్లి సిఐ శ్రీ టీవీ కొండారెడ్డి, గాలివీడు ఎస్సై రామకృష్ణ ప్రధాన అతిథులుగా హాజరై ప్రజలకు సూచనలు అందించారు.పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని అధికారులు సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం అందరి బాధ్యతని పేర్కొన్నారు.