అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీలో కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీ పంచాయతీలో షేక్ షేక్షావలి అనే వ్యక్తి కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.