రాజేంద్రనగర్ ఈవీఎం గోదామును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాము సీల్ తెరచి, బ్యాలెట్ యూనిట్లు, ఈవీఎంలను పరిశీలించారు. యంత్రాల భద్రత, నిర్వహణపై అధికారులకు సూచనలు జారీ చేసిన కలెక్టర్.. తనిఖీ అనంతరం మళ్లీ ప్రతినిధుల సమక్షంలో గోదాము సీల్ వేయించారు.