కావలి: కావలిలో వింత శబ్దాలు.. కారణం ఇదే.!
కావలి మండలం ముసునూరు ఆటోనగర్ సమీపంలోని మాగుంట పార్వతమ్మ లే అవుట్లో ఆదివారం వింత శబ్దాలు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ONGC కంపెనీ ఆయిల్ నమూనాల కోసం చేపట్టిన తవ్వకాలే కారణమని ఆ సంస్థ ప్రతినిధులు ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిర్ధారించారు. దీంతో స్థానికులు ఊరిపి పీల్చుకున్నారు.