రాయలసీమ ప్రాంతం దూదేకుల నూర్ భాషా దూదేకుల హక్కుల సాధన కోసం గ్రేటర్ రాయలసీమ నినాదాన్ని చేపట్టారు ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని మాసాపేటలో రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నూర్ భాషా దూదేకుల ముఖ్య నాయకులతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిడాల సిద్దయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్వీ పాలకమండలి పూర్వ సభ్యులు కవి రచయిత కళా రత్న డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్ మరియు డాక్టర్ ఇందాదుల్లా మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు వచ్చినా రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా ఉండే నూర్ భాషా దూదేకులకు రాజకీయంగా సామాజికంగా అన్యాయం జరగుతోందని అన్నారు.