ఒంగోలు అర్బన్: ఒంగోలులో మహానాడు భారీ విజయవంతమైంది: టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
Ongole Urban, Prakasam | May 29, 2026
రాష్ట్ర నలుమూలల కు వ్యాపించే విధంగా జరిగిన మహానాడు పూర్తిగా విజయవంతమైందని రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల మంది పాల్గొన్నారు అని జిల్లాలో కూడా విజయవంతమైందని జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఒంగోలు రామ్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తొలిత క్లస్టర్ స్థాయిలో జరపాలని చెప్పినప్పుడు కొంత సంకోచించినప్పటికీ ఆచరణలో సాధ్యమైందని ఎక్కువమంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈ మహానాడు లో పాల్గొన్నారు అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ని ముందుకు తీసుకెళ్లే భాగంగా దూర దృష్టితో ఆలోచించాలన్న