ఒంగోలు అర్బన్: ప్రజల పక్షాన వైసిపి చేస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకే మద్యం కేసులు పెడుతున్నారు : వైసీపీ బీసీ సెల్ నేతలు
Ongole Urban, Prakasam | Jun 19, 2026
ప్రజా సమస్యలపై వైయస్ఆర్సీపీ పోరాటాన్ని అడ్డుకునే కుట్ర లో భాగంగా మద్యం కేసులు సృష్టించి వైయస్ఆర్సీపీ నాయకులను వేధించడం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని భయపెట్టాలని ప్రభుత్వం భావించడం భ్రమేనని,లేని మద్యం కేసులు సృష్టించి వైయస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన కుమారుడు కారుమూరి సునీల్ను అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయి.