రాష్ట్ర సిఎం మరియు గవర్నర్ ల కార్యక్రమాలను విజయవంతం చేయండి : జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు గవర్నర్ ఎస్ . అబ్దుల్ నజీర్ లు ఈ నెల 6 న సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా సమన్వయంతో అధికారులు ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు.శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి యాడికి ప్రాంతంలో జలధార కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. అలాగే అదే రోజున స్థానిక జేఎన్టీయూ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరుతున్నట్లు తెలిపారు.