బనగానపల్లె: చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి :అవుకులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంత చెరువుల అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అవుకు మండలం వేములపాడు గ్రామ సమీపంలోని చెరువు కట్ట, తూము, కాలువలను సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. స్థానిక ఉపాధి కూలీలతో మంత్రి బీసీ ముచ్చటించారు. MRO నాగేశ్వరరెడ్డి ఉన్నారు.