చీమకుర్తి మండలం దేవరపాలెంలో ఎస్సీ కాలనీ లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎస్సీలు మాజీ మంత్రి , సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి మేరుగ నాగార్జునకు కాలనీవాసులు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో చీమకుర్తిలోని విద్యుత్ కార్యాలయానికి బుధవారం వెళ్ళిన మాజీ మంత్రి నాగార్జున విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన కోరారు. విద్యుత్ అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలో కాలనీకి విద్యుత్తును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.