బేతంచెర్లలోని ప్రధాన రహదారి వెంట నిర్ణీత వేగంతో వాహనాలు నడపాలని ఎస్సై రమేశ్ బాబు సూచించారు. సోమవారం ప్రధాన రహదారి వెంట వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఇందులో రికార్డులు సరిగా లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని, అధిక లోడ్తో వెళ్తున్న వాహనదారులపై జరిమానా విధించారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి నడపవద్దని సూచించారు.