మంత్రాలయం: విద్య వైద్యం అందాలంటే, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణం కావాలంటే అది ఆదోని జిల్లాతోనే సాధ్యం: బిఎస్ఎస్
మంత్రాలయం:కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని జిల్లాగా ప్రకటించాలని మంత్రాలయం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కూడలిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలు బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేశ్ ఆధ్వర్యంలో చేపట్టారు. మంగళవారం ఈ దీక్షలలో బహుజన సమైక్య సమితి నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య వైద్యం అందాలంటే, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణం కావాలంటే అది ఆదోని జిల్లాతోనే సాధ్య పడుతుందని అన్నారు.