మంత్రాలయం: మండలం లోని మాధవరం రహదారిపై అభయ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన ఆవు మృతి చెందింది. శనివారం రాయచూర్ వైపు గ్యాస్ సిలిండర్లను వేసుకుని వెళ్తున్న లారీ, రోడ్డు దాటుతున్న ఆవును ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.