రాంకో సిమెంట్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తోందని జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం కొలిమిగుండ్లలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు దోచిపెడుతున్న రాంకో పరిశ్రమ భూములు ఇచ్చిన రైతులకు, సామాన్యులకు మాత్రం అన్యాయం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.