ధర్మవరం పట్టణం గుడ్ షెడ్ కొట్టాలకు చెందిన శ్రీనివాసులు(40) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం ధర్మవరం రైల్వే స్టేషన్ ఒకటో ప్లాట్ఫారం వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసులు తన తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య చిన్న మనస్తాపం రావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.