బనగానపల్లె ఆర్డీవో నరేంద్ర కుమార్ రెడ్డిని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేడం సుబ్బరాయుడు కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.పేదలకు నివేశన స్థలాల పంపిణీకి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవోకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.