ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి లో ఆదివారం రాత్రి అత్త రమణమ్మ పై అల్లుడు నారాయణ కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. స్థానికులు వెంటనే రవణమ్మను ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స చేసి వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. హాస్పటల్లో అటు రవణమ్మ బంధువులు నారాయణ పై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.