ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయం మార్పులు
Ongole Urban, Prakasam | May 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మే 4 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయం మార్పులు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు మీడియాకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 నుంచి 11 వరకు మాత్రమే కార్యాలయంలో అర్జీలు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రకాశం జిల్లాలో తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో సమయం మార్పులను చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆ సమయాలలో మాత్రమే అర్జీలు ఇచ్చేందుకు రావాలన్నారు.