శ్రీకాకుళం: కవిటి లో కూటమి బూటకపు పథకాలపై ప్రజలు స్పందించాలన్న జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్
రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన పట్ల ప్రజల నుండి ఇప్పటికే వ్యతిరేకత ఏర్పడిందని జిల్లా వైసిపి అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ ధ్వజమెత్తారు. ఆదివారం కవిటి మండల కేంద్రంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు మభ్య పెట్టే విధంగా బూటకపు పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు