టంగుటూరు లోని ఓ గోడౌన్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మండలంలోని సింగరాయకొండ రోడ్డులోని బెల్లం కోటయ్య పొగాకు గోడౌన్లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గౌడోన్లో స్టాక్ ఉంచిన రూ.కోట్ల విలువైన పొగాకు బేళ్లు దగ్ధమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఒంగోలు డి.ఎస్.పి , సింగరాయకొండ, టంగుటూరు ఎస్సైలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.