ఒంగోలు అర్బన్: ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి సమావేశం
Ongole Urban, Prakasam | Jun 10, 2026
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి సమీక్షా సమావేశాన్ని బుధవారం రెవిన్యూ భవనంలో జిల్లా చైర్మన్ పిన్నికి మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పిఆర్సిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని పిఎఫ్ బకాయిలను పే స్లిప్ లో చూపించాలంటూ డిమాండ్ చేశారు ఎప్పటికీ ఉద్యోగులు ఎంతో సమన్వయంగా ఉన్నారని తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమం చేపట్టబోతున్నామని త్వరలోనే ఉద్యమ కార్యాచరణ కూడా తెలియజేస్తామన్నారు