నంద్యాలలో రూ.10 వడ్డీ వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వడ్డీ మాఫియాపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు కోళ్ల కళ్యాణ్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని, డబ్బు చెల్లించినా రద్దు చేయకుండా ఇంకా బాకీ ఉన్నారని బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీకి వారు విన్నవించారు.