నందికోట్కూరు: నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ లో లీటర్ మినరల్ వాటర్ లూజ్ : ఆరు రూపాయలు కాదు 8 రూపాయలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రయాణికుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు అయితే ఈ ట్యాంకు సంబంధించి కుళాయిలు పూర్తిగా కిందకు ఉండడంతో వృద్ధులు మరి కొందరు కిందకు వంగి తాగలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు తెలిపారు, బస్టాండ్లో మినరల్ వాటర్ లూజ్ లీటర్ ఆరు రూపాయలకు బదులుగా 8 రూపాయలకు విక్రయిస్తున్నారని అన్నారు, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు