ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ 2 లో ఇండ్ల స్థలాలను ఆక్రమించి అక్రమంగా బేస్ మెంట్ కట్టారని ఎమ్మార్వో చిరంజీవి అన్నారు. మార్కాపురం జిల్లా కాబోతున్న నేపథ్యంలో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నాలు చేపట్టారని ఆయన అన్నారు. 20 సంవత్సరాల క్రితం 82 ఎకరాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటి మధ్యలో రాత్రికి రాత్రి ఆక్రమించి బేస్ మెంట్ కట్టి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో తెలుసుకొని జెసిబి సహాయంతో వాటిని తొలగించడం జరుగుతుందన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.