భారతదేశం యొక్క సంప్రదాయం, సంస్కృతీ, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద. కలెక్టర్
భారతదేశం యొక్క సంప్రదాయం, సంస్కృతీ, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని, వారిని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం కలెక్టరేట్లోని విసి హల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజుతో కలసి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, భారతదేశం సంస్కృతీ, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు