పెద్దవూర: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన వరద ప్రవాహం గేట్లు మూసివేసిన అధికారులు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను సోమవారం మూసివేశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం తెలిసిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 587.40 అడుగుల వద్ద ఉందన్నారు. ఇన్ఫ్లో 50,559 క్యూసెక్కులు కాగా, అవుట్లో 50, 559 క్యూసెక్కులుగా కొనసాగుతుందని తెలిపారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. తాగు సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.