కోటిపల్లి వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద, పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంక రైతులు
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో కె.గంగవరం మండలం, కోటిపల్లి గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. దీంతో లంక భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు రాకపోకలకు పడవలపై ఆధారపడుతున్నారు. తమ వ్యవసాయ ఉత్పత్తులు, పశుగ్రాసం వంటి వాటిని పడవలపైనే తరలిస్తున్నారు. ఈ సీజన్లో మూడో సారి వరద ప్రవాహం పెరిగిందని ఎవరు ఇబ్బందులు పడుతున్నామని వరద తగ్గేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాపోయారు