బనగానపల్లె: వైయస్ జగన్ ను కలిసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం కలిశారు. బనగానపల్లె నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, సమస్యలు, పార్టీ బలోపేతం తదితర వాటిపై చర్చించారు. పార్టీ శ్రేణులు వైసీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ సూచించారు. నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామమని జగన్కు కాటసాని వివరించారు.