సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో కేశంపేట మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.8,42,500 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే నిరుపేదలు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.