బనగానపల్లె: బనగానపల్లెలో గాలివాన బీభత్సం, గోడ కూలి 20 గొర్రెల మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కోవెలకుంట్ల - గుంజలపాడు, బనగానపల్లె రహదారులపై భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంజామల మండలం ముదిగేడులో గాలివానకు రైస్ మిల్లు గోడ కూలి, దాని కింద నలిగి 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.